సిఎంకు తలనొప్పి, న్యాయ సలహా తర్వాతే మంత్రులపై...
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 జీవోలను ప్రాతిపదికగా తీసుకుని సిబిఐ వైయస్ జగన్ ఆస్తుల కేసుపై దర్యాప్తు చేస్తోంది. ఈ జీవోల ద్వారా వివిధ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చారని, అందుకు ప్రతిగా ఆ కంపెనీలు జగన్ సంస్థల్లో ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని ఆరోపిస్తున్నారు. ఆరుగురు మంత్రుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపై కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకోలేకపోతున్నారు. వారిని రాజీనామా చేయాలని అడిగే శక్తి ఆయనకు లేదు. అలా అడిగితే ప్రభుత్వానికే ముప్పు ఏర్పడవచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచే కాకుండా ఇతర ప్రతిపక్షాల నుంచి కూడా మంత్రుల విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది.
తన భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఆరు మంత్రుల్లో నలుగురు శానససభ లాబీలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిని గీతా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, కన్నా లక్ష్మినారాయణ మంగళవారం కలిశారు. సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులపై న్యాయ సలహాను కోరుతున్నట్లు ముఖ్యమంత్రి వారికి చెప్పారు. జీవో జారీలో తాము నిబంధనలను ఉల్లంఘించలేదని మంత్రి గీతా రెడ్డి అంటున్నారు. తెర వెనక వ్యవహారాలతో తమకు సంబంధం లేదని ఆమె చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ జగన్ను ఎందుకు వెనకేసుకొని వస్తుందో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.