మంత్రులకు నోటీసులు: కిరణ్ తీరుపై జానా అసంతృప్తి

K Jana Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసుల వ్యవహారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి సోమవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులకు సుప్రీం నోటీసులను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అయినా మరే విపక్షమైనా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నోటీసులపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాల్సి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని నోటీసులపై వివరణ ఇస్తే బాగుండేదని అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సీనియర్లతో మాట్లాడాలన్నారు. వారిలో విశ్వాసం కలిగించాలన్నారు.

మంత్రులు కూడా ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాకేం సంబంధం లేదన్నట్లుగా ఎవరికి వారు వ్యవహరిస్తున్నారని చురకలు వేశారు. కాగా జగన్ ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు ఆరుగురు మంత్రులకు సోమవారం తాఖీదులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులపై విపక్షాలు రెండు రోజులుగా సభలో గందరగోళం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మంత్రులు రాజీనామా చేయాలని టిడిపి పట్టుబడుతోంది. దీంతో స్పీకర్ సభను పలుమార్లు వాయిదా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+