వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ కోటి అంటే కిరణ్ 15 లక్షలంటున్నారు: హరికృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna
ఒంగోలు: కాంగ్రెసు ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ సోమవారం ప్రకాశం జిల్లా అద్దంకిలో మండిపడ్డారు. ఆయన శింగరకొండ పుణ్యక్షేత్ర దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు మాత్రం మండిపోతున్నాయని అన్నారు. ఈ ధరల పెరుగుదలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారని, అవి ఎటు పోయాయో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మూడేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు అంటున్నారని ఇవన్నీ సాధ్యమయ్యే పనా అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపింది టిడిపి మాత్రమేనన్నారు. వెనుకబడిన తెలంగాణ బాగుకోసం పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయించింది స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలను టిడిపి కైవసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
TDP leader Harikrishna said that CM Kiran Kumar Reddy is following late YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X