వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభలో కళ్లు తిరిగి పడిపోయిన శరద్ పవార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharad Pawar
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ మంగళవారం పార్లమెంటులో కళ్లు తిరిగి పడిపోయారు. కేంద్ర హోంమంత్రి చిదంబరం లోకసభలో మాట్లాడుతుండగా శరద్ పవార్ తన చాంబరుకు వెళ్లేందుకు లేచారు. ఆయన బయటకు వస్తుండగా హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. ఇది గమనించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుడు, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు వెంటనే సెంట్రల్ హాలుకు పరుగెత్తుకు వెళ్లి డాక్టరును తీసుకు వచ్చారు. డాక్టరు శరద్ పవార్‌కు చెకప్ చేశారు. పరిశీలించిన డాక్టర్ ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు.

వృద్ధాప్యం, లో బిపి కారణంగానే శరద్ పవార్ కళ్లు తిరిగి పడిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. అనంతరం అతనిని ఆయన చాంబరులో విశ్రాంతి కల్పించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఆర్ఎంఎల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న వేధింపులపై చర్చ చేపట్టాలని విపక్షాలు రాజ్యసభలో పట్టుబట్టాయి. దాంతో రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న అత్యాచారాలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ తమిళ పార్టీలు తీవ్ర నిరశన తెలిపాయి. ఈ అంశాన్ని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తామని ప్రణబ్ ముఖర్జీ లోకసభలో ప్రకటించారు.

English summary
Central Minister Sharad Pawar injured and took to RML hospital for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X