సిఎం అయ్యే అర్హత ఉంది, కానీ అభిలాష లేదు: జానారెడ్డి
కాగా బుధవారం జానా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ఏదో అద్బుతం జరిగితే కానీ కాంగ్రెసు పార్టీ గట్టెక్క పోవచ్చునని, అలాంటి అద్భుతం జరుగుతుందని తాను ఆశిస్తున్నానని అన్న విషయం తెలిసిందే. సీనియర్ కాంగ్రెసు పార్టీ నేత కె కేశవ రావుకు మళ్లీ రాజ్యసభ వస్తుందని తాను అభిప్రాయపడుతున్నానని అన్నారు. ప్రభుత్వంలో, కాంగ్రెసులో ప్రస్తుతం ఎవరో ఒకరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. వీటినన్నింటిని అధిగమించి తాము 2014లో వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసును గట్టెక్కిస్తామని చెప్పారు. ఏదో విధంగా తెలంగాణ సాధించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ గెలిస్తే తెలంగాణ సెంటిమెంటుపై రెడ్డి సెంటిమెంట్ గెలిచినట్లేనని అన్నారు.
Comments
English summary
Minister Jana Reddy clarified on his statement about Congress winning in 2014 general elections.
Story first published: Thursday, March 15, 2012, 15:12 [IST]