చిరంజీవి పార్టీ కార్యాలయం మూసివేత
ఈసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అసెంబ్లీలో ప్రజారాజ్యాన్ని ప్రత్యేకంగా చూడటంపై విపక్షాలు పలుమార్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ను ప్రశ్నించాయి. ఆ తర్వాత శోభా నాగి రెడ్డి రాజీనామా ఆమోదించడం, చిరంజీవికి రాజ్యసభ సీటు ఖాయమైందన్న వార్తల నేపథ్యంలో ఇటీవల ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయి విలీనం తీర్మానం చేశాయి. దానిని కాంగ్రెసుకు పంపించాయి. అక్కడ కూడా ఆమోదం పొందిన తీర్మానం ఇటీవల స్పీకర్ దగ్గరకు వచ్చింది. దీంతో స్పీకర్ నాలుగు రోజుల క్రితం కాంగ్రెసులో పిఆర్పీ విలీనాన్ని అధికారికంగా ప్రకటించారు. అసెంబ్లీలో కూడా పిఆర్పీ విలీనం అధికారం కావడంతో చిరంజీవి పార్టీ కార్యాలయాన్ని మూసివేశారు.
Comments
chiranjeevi prajarajyam congress assembly hyderabad చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెసు అసెంబ్లీ హైదరాబాద్
English summary
Tirupati MLA Chiranjeevi Party Prajarajyam closed today in Assembly.
Story first published: Thursday, March 15, 2012, 13:51 [IST]