హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛార్జీషీట్ దాఖలు చేయలేదు, బెయిల్ ఇవ్వండి: శ్రీలక్ష్మి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srilakshmi
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టు అయిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీం కోర్టు చేసిన సూచనల మేరకు ఆమె మరోసారి కోర్టును ఆశ్రయించారు. తన న్యాయవాది సురేంద్ర రావు ద్వారా నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనను 120(బి), 407 తదితర సెక్షన్ల కిందే సిబిఐ అరెస్టు చేసిందని, ఆ ప్రకారం అరవై రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయడంలో సిబిఐ విఫలమైనందున బెయిల్ ఇవ్వాలని శ్రీలక్ష్మి సుప్రీం కోర్టులో వాదించిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టు సూచనల మేరకు ఆమె ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు.

కేసుకు సంబంధించి ఇప్పటికే తన నుండి అవసరమైన సమాచారాన్ని సిబిఐ అధికారులు తీసుకున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేస్తే కేసుపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీలక్ష్మిని అరెస్టు చేసి అరవై రోజులు అయినప్పటికీ ఛార్జీషీట్ దాఖలు చేయనందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

English summary
IAS officer Srilaxmi filed a bail application in the CBI special Court on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X