టిడిపిలో రాజ్యసభ చిచ్చు:బాబుపై తలసాని,కెఇ కినుక

talasani srinivas yadav
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ చిచ్చు రగిలింది. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కినుక వహించారు. శనివారం సాయంత్రం రాజ్యసభ పేర్లను ఫైనలైజ్ చేసేందుకు బాబు ఆధ్వర్యంలో టిడిపి పోలిట్ బ్యూరో సమావేశమైంది. ఇప్పటికే సిఎం రమేష్, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. వారిని అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీకి ముందు చంద్రబాబును కలిశారు. అనంతరం ఆయన బాబుపై ఆగ్రహంతో బయటకు వచ్చి వెళ్లి పోయారు. ఈ సందర్భంగా విలేకరులు ఆయనను ప్రశ్నించారు. తాను రాజ్యసభ అభ్యర్థిత్వాలపై చెప్పాల్సింది చెప్పానని అన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక సరిగా లేదని తాను బాబుతో చెప్పానని అన్నారు. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన తర్వాత తాను స్పందిస్తానని ఆయన చెప్పారు. అనంతరం తలసానికి వెళుతుండగా ఇద్దరు టిడిపి నేతలు ఎదురయ్యారు. పార్టీ నుండి బయటకు వెళ్లి వచ్చిన వారికి రాజ్యసభ ఇస్తే పార్టీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని, మీరు కూడా ఈ అభ్యర్థిత్వాలని వ్యతిరేకించాలని సూచించారట. అయితే రాజ్యసభ అభ్యర్థుల విషయంలో తలసాని అధినేతతో విబేధించడం పార్టీలో చర్చనీయాంశమైంది.

కాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పార్టీ నేతలతో విడివిడిగా మాట్లాడుతున్నారు. వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అయితే తలసానితో పాటు పలువురు నేతలు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉదయం నుండి చంద్రబాబును కోడెల శివ ప్రసాద్, దాడి వీరభద్ర రావు, పెద్దిరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు కలిశారు. కాగా కెఇ కృష్ణమూర్తి కూడా చంద్రబాబుపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉంటుందో పోతుందో చెప్పలేమని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+