నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిష్కరిస్తేనే: కొవూరులో ఓటింగ్‌ బహిష్కరించిన గ్రామం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nellore
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో ఓ గ్రామం ఓటింగును బహిష్కరించింది. ఈ నియోజకవర్గంలోని శ్రీపురంధరపురం గ్రామస్తులు ఆదివారం ఓటింగును బహిష్కరించారు. తాము ఏ పార్టీకి ఓటు వేసేది లేదని తేల్చి చెప్పారు. తమ గ్రామంలో ఏ పార్టీ ఇప్పటి వరకు సమస్యలను తీర్చడం లేదని, అవి తీర్చిన తర్వాతే ఓట్లు వేస్తామని తేల్చి చెప్పారు. కొన్నేళ్లుగా తాము అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం తెలిసిన ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్ లాల్ స్పందించారు. శ్రీపురంధరపురానికి ఆర్డీవోను పంపిస్తామని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యల్ని ఇప్పుడే పరిష్కరించలేం కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ గ్రామం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉంది.

కాగా నిజామాబాది జిల్లాలో ఉప ఎన్నికల్లో ఓ ప్రిసైడింగ్ అధికారి నిర్వాకం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈవిఎంలో ఓటు వేయడం తెలియని ఒక వృద్ధ మహిళా కాంగ్రెసు గుర్తుపై ఓటు వేసేందుకు సహకరించమని ప్రిసైండింగ్ అధికారిని కోరింది. అయితే ఆ అధికారి మాత్రం ఓటును టిఆర్ఎస్‌కు వేశారు. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. కాగా వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఓ కాంగ్రెసు నేత ఇంట్లో పోలీసులు రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. జఫర్‌గడ్‌లో టిడిపి నేత మనోజ్ రెడ్డిని బైండోవర్ కేసు కింద అరెస్టు చేశారు. నాగర్ కర్నూలులోని రాకొండలో టిడిపి, కాంగ్రెసు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలింగ్ కొద్ది సేపు నిలిచిపోయింది.

English summary
Sri Purandharapuram of Kovvur constituency people boycotted bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X