వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసుకు ఓకే, టిడిపికి అంత డబ్బెక్కడిది?: వాసిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

vasireddy padm
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు చేశాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి వారికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో అర్థం చేసుకోవచ్చుని, కానీ తెలుగుదేశం పార్టీకి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. టిడిపికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలన్నారు. కొవూరు ఉప ఎన్నికల్లో అక్కడి ప్రజలు విశ్వసనీయతకు, విలువలకు ఓటు వేశారని అన్నారు.

ఉప ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెసు పార్టీలు పోటీలు పడి మరీ డబ్బులు ఖర్చు చేశాయని ఆరోపించారు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని తాము కోరతామని అన్నారు. కాగా ఆదివారం తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో, కొవూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 21వ వెలువడనున్నాయి.

English summary
YSR Congress Party spokes person Vasireddy Padma alleged that TDP and Congress leaders were gave money to Kovur voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X