మమ్మల్ని ప్రజలు కొంత నమ్మారు: తెలంగాణపై బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ విషయంలో తమ వాదనతో ప్రజలను కొంత మేరకు నమ్మించగలిగామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎన్నికల ఫలితాలను తాము సమీక్షించుకుని, ముందుకు పోవడానికి ఏం చేయాలో ఆలోచన చేస్తామని ఆయన అన్నారు. గతంలో తాము తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితే లేదని, ఇప్పుడు ఆ విధమైన పరిస్థితి లేదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తమది పరిమితమైన పాత్ర అని, ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత కాంగ్రెసు పార్టీది, కేంద్ర ప్రభుత్వానిదని ఆయన అన్నారు. అనవసరంగా తమపై తెలంగాణ విషయంలో నిందలు వేస్తున్నారని ప్రజలకు చెప్పామని, తమ వాదనను తెలంగాణ ప్రజలు కొంత మేరకు విశ్వసించారని ఆయన అన్నారు.

తెలంగాణకు తాము అన్యాయం చేయలేదని, తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెప్పగలిగామని ఆయన అన్నారు. సెంటిమెంటును గుర్తిస్తూనే అభివృద్ధి చేశామని చెప్పామని ఆయన అన్నారు. ఈ విషయంలో తాము కొంత మేర విజయం సాధించామని ఆయన అన్నారు. తమ పార్టీని బలహీనపరచాలని, తమ పార్టీ శాసనసభ్యులను లాక్కుని ఉప ఎన్నికలు తెచ్చారని ఆయన విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఉప ఎన్నికలు తెచ్చారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిలో వెనకడుగు వేస్తోందని ఆయన అన్నారు. 2009 తర్వాత వరుసగా ఉప ఎన్నికలు వస్తున్నాయని, ఈ రకంగా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+