వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్దే భవిష్యత్తు: కోవూరుపై శ్రీకాంత్ రెడ్డి
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పెద్ద యెత్తున కోవూరులో డబ్బులు కుమ్మరించాయని, ప్రజలను కొనుక్కోవడం సాధ్యం కాదని కోవూరు ప్రజలు నిరూపించారని ఆయన అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని, ఈ రెండు పార్టీలు కుమ్మక్కయి శాసనసభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చూస్తున్నాయని, ఆ పార్టీలకు ప్రజలు పట్టడం లేదని ఆయన అన్నారు. తాము నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీల దుష్టసంప్రదాయానికి స్వస్తి చెప్పేలా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. కోవూరులో తమ పార్టీ కార్యకర్తలను కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించిన కోవూరు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
English summary
YSR Congress leader Srikanth Reddy said that only YS Jagan's party is having future.
Story first published: Wednesday, March 21, 2012, 13:34 [IST]