వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌దే భవిష్యత్తు: కోవూరుపై శ్రీకాంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikanth Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో భవిష్యత్తు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీదేనని ఆ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కోవూరులో తమ పార్టీ విజయం తర్వాత ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే 17 స్థానాల ఉప ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామని, కోవూరు ఉప ఎన్నిక ఫలితం అందుకు సూచిక అని ఆయన అన్నారు. కాంగ్రెసుకు, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదని ఆయన అన్నారు. ఆ పార్టీలు రెండు కుమ్మక్కయి తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయాన్ని అడ్డుకోవడానికి విఫలయత్నం చేశాయని ఆయన విమర్శించారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పెద్ద యెత్తున కోవూరులో డబ్బులు కుమ్మరించాయని, ప్రజలను కొనుక్కోవడం సాధ్యం కాదని కోవూరు ప్రజలు నిరూపించారని ఆయన అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని, ఈ రెండు పార్టీలు కుమ్మక్కయి శాసనసభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చూస్తున్నాయని, ఆ పార్టీలకు ప్రజలు పట్టడం లేదని ఆయన అన్నారు. తాము నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీల దుష్టసంప్రదాయానికి స్వస్తి చెప్పేలా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. కోవూరులో తమ పార్టీ కార్యకర్తలను కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించిన కోవూరు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

English summary
YSR Congress leader Srikanth Reddy said that only YS Jagan's party is having future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X