తెలంగాణపై సోనియా గాంధీ ఆలోచన చేస్తున్నారా?
ఆ వాదనకు బలం చేకూర్చే విధంగానే కాంగ్రెసు తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెసు మట్టి కొట్టుకుపోవడం ఖాయమనే వారంటున్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానంపై కాంగ్రెసు నాయకులు ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయి. తెలంగాణను తేల్చకపోతే ఫలితాలు ఘోరంగా ఉంటాయని సోనియా గ్రహింపునకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో తెలంగాణను తేల్చేయడమే మంచిదనే భావనతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు.
సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు మధ్య పోటీ ఉంటుందని, తెలంగాణలో తెరాస సీట్లను కొట్టుకుపోతుందని, పైగా బిజెపి బలపడే అవకాశాలున్నాయని ప్రస్తుత ఎన్నికల ఫలితాలను బట్టి విశ్లేషిస్తున్నారు. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఈ ప్రాంతంలోనైనా పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సోనియా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీమాంధ్రలో గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు వదిలేసి, తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. వీలైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చి, తెరాస విలీనానికి ప్రయత్నాలు చేయాలని సోనియా అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, తెలంగాణపై సోనియా గాంధీ సీరియస్గా ఆలోచించాల్సిన స్థితిని ఈ ఫలితాలు కల్పించాయని అంటున్నారు.