వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోకసభలో సహకారానికి టి - కాంగ్రెసు ఎంపిలు నో
కాగా, తెలంగాణపై త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణకు చెందిన మంత్రి సారయ్య హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభా సమావేశాలు ముగియగానే తెలంగాణపై అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు. రెండు, మూడు రోజుల్లో తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు సమావేశమై తెలంగాణపై కార్యాచరణ రూపొందించుకునే అవకాశాలున్నాయి.
తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని తాము కూడా కోరుకుంటున్నట్లు రాయలసీమకు చెందిన మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరడానికి తాము ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు.
Comments
English summary
Telangana Congress MPs rejected to cooperate in Loksabha till the debate is allowed on Telangana issue.
Story first published: Monday, March 26, 2012, 16:10 [IST]