తండ్రి శవంతో వైయస్ జగన్ రాజకీయం: చంద్రబాబు
జగన్ లాంటివాళ్లను చాలా మందిని చూశామని, తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేకపోయారని, జగన్ కూడా ఏమీ చేయలేడని ఆయన అన్నారు. వేల కోట్ల రూపాయలు జగన్కు ఎలా వచ్చాయని ఆయన అడిగారు. ఓదార్పు పేరుతో ఊరూరూ వెళ్లి జగన్ కథలు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన ఆస్తులపై వివరణ ఇచ్చానని, జగన్ కూడా తన ఆస్తులపై వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు. సిబిఐ వద్దకు జగన్ తండ్రి వెళ్లాడు, జగన్ తల్లి వెళ్లిందని, ఏమీ చేయలేకపోయారని ఆనయ అన్నారు. తప్పును కప్పి పుచ్చుకోవడానికి జగన్ ఎదుటివారిపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఝంగా మార్చలేదా అని ఆయన అడిగారు. దమ్ముంటే ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని ఆయన జగన్ను సవాల్ చేశారు.
శవరాజకీయాలు చేసేవారా తమపై మాట్లాడేదని, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని ఆయన జగన్ను ఉద్దేశించి అన్నారు. తమ కుటుంబం ఏ విధమైన తప్పూ చేయలేదని, అధికారాన్ని అడ్డం పెట్టుకోలేదని ఆయన అన్నారు. ఎన్నికలను జగన్ కోడిపందాలుగా మార్చారని ఆయన ఆరోపించారు. జగన్వి హీనరాజకీయాలని, అధికారం వస్తే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకుంటాడని ఆయన అన్నారు. జగన్కు నైతిక విలువలు లేవని ఆయన అన్నారు.
తెలంగాణపై తమ నిర్ణయం ఎప్పుడో చెప్పామని, అధికార కాంగ్రెసు పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. విలువైన జీవితాలను కోల్పోవద్దని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెసు తమపై నిందలు మోపాలని చూస్తోందని ఆయన అన్నారు.