హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూసైడ్ నోట్లపై సభలో చర్చించండి: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై నాయకులు చేస్తున్న విభిన్న ప్రకటనలపై తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మహత్యలపై అనుమానాలుంటే సూసైడ్ నోట్లపై శాసనసభలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీల వైఫల్యం వల్లనే యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వ్యాఖ్యల వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. నాయకులు అనవసరంగా మాట్లాడడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇంత మంది చనిపోతున్నా తెలంగాణ మంత్రుల్లో చలనం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే లక్ష్యంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలోని ఆత్మహత్యలకు పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

English summary
Telangana political JAC chairman Kodandaram has blamed political parties for Telangana suicides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X