హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దెబ్బతీయాలని చూశారు, కానీ బలపడ్డాం: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని కానీ అది ఎవరికీ సాధ్యం కాదని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రోజు చరిత్ర సృష్టించిన రోజన్నారు. కార్యకర్తల కృషితోనే పార్టీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. ప్రాంతీయ పార్టీగా దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు టిడిపి నాంది పలికిందన్నారు. టిడిపిని ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం స్థాపించారన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

పార్టీ పుట్టినప్పటి నుండి ఎందరో టిడిపిని దెబ్బతీయాలని చూశారని, కానీ పార్టీ మరింద బలపడిందే కానీ బలహీనపడలేదన్నారు. కాగా మార్చి 29(గురువారం) నాటికి తెలుగుదేశం పార్టీ స్థాపించి ముప్పయ్యేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బాబు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu said that party strengthen in this thirty years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X