విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Krishna Map
విజయవాడ: కృష్ణా జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బండి వెంకటేశ్వర రావు గురువారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఘంటసాల మండలంలోని చిట్టూర్పు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు బైక్ పైన వచ్చి వెంకటేశ్వర రావును కత్తులతో పొడిచి హత్య చేశారు. హత్యకు కారణాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ భూతగాదాలు కారణం కావచ్చునని భావిస్తున్నారు. ఇతని మృతదేహం చేపల చెరువు వద్ద లభించింది.

కాగా రెండు రోజుల క్రితం కడప జిల్లాలోని తొండూరు మండలం బూచుపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు రమణా రెడ్డి ప్రత్యర్థుల చేతిలో మంగళవారం సాయంత్రం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రత్యర్థులు అతన్ని వేటకొడవళ్లతో నరికి చంపారు. పొలం వద్ద ట్రాక్టర్‌లో మట్టి పనిచేస్తుంటే ప్రత్యర్థులు దాడి చేసి రమణా రెడ్డిని హత్య చేశారు. హత్య జరిగిన బూచుపల్లి గ్రామం వైయస్ విజయమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల శాసనసభా నియోజకవర్గంలోనే ఉంది.

English summary
YSR Congress leader Venkateshwar Rao was killed by his opponents in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X