తెలంగాణ: సోనియా విన్నారు, సుష్మా ఇస్తామన్నారు

కాగా, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని లోకసభలో బిజెపి పక్ష నేత సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల కల తప్పకుండా నెరవేరుతుందని ఆమె అన్నారు. తెలంగాణలోని ఆత్మహత్యలు తనను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని ఆమె అన్నారు. తెలంగాణ కోసం తమ పార్టీ పోరాడుతుందని ఆమె చెప్పారు. తెలంగాణకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తాము ఢిల్లీలో వినిపిస్తామని ఆమె చెప్పారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె తెలంగాణ యువతకు పిలుపునిచ్చారు. తనను కలిసిన తెలంగాణవాదులతో ఆమె మాట్లాడారు.












Click it and Unblock the Notifications