బాబు కనిపించట్లేదా: సిబిఐ ఛార్జీషీట్పై జగన్ సూటి ప్రశ్న
సిబిఐ తన మీద ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు చూశానని అన్నారు. పరిశ్రమల కోసం రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ వెళ్లి అడిగితే భూమి ఉచితంగా ఇస్తారని అన్నారు. తమిళనాడు తదితర రాష్ట్రాలు భూములు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కట్టబెట్టిన భూముల సంగతేమిటన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో రైతులు, పేదల కోసం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అనర్హత వేటు వేయించుకున్న సుచరితకు పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ చచ్చి పోయిందన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
Comments
ys jagan cbi probe chandrababu naidu kiran kumar reddy guntur వైయస్ జగన్ సిబిఐ దర్యాఫ్తు చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి గుంటూరు
English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy questioned CBI about TDP chief Nara Chandrababu Naidu land allocations.
Story first published: Monday, April 2, 2012, 8:49 [IST]