విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి వంగవీటి రాధా: ముహూర్తం ఖరారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vangaveeti Radhakrishna
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి విజయవాడకు చెందిన వంగవీటి రాధా చేరేందుకు ముహూర్తం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. తీవ్ర తర్జన భర్జనల అనంతరం జూలై నాలుగో తేదిన జగన్ పార్టీలో చేరేందుకు వంగవీటి రాధా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో జగన్‌ను రాధాకృష్ణ కలిసిన తర్వాత తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

దీంతో ఆయన ఎప్పుడు చేరుతారనే చర్చ జరిగింది. శుక్రవారం జగన్‌తో భేటీ అయిన అనంతరం పలువురు వంగవీటి అనుచరులు జగన్ పార్టీలోకి వద్దని వారించారట. దీంతో ఆయన ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు కనిపించారని అంటున్నారు. ఆ తర్వాత రాధారంగ మిత్ర మండలితో పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం జగన్ పార్టీలో చేరితేనే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని అందరూ భావించారట. దీంతో ఆయన జగన్ పార్టీలో చేరేందుకు తన తండ్రి పుట్టిన తేది అయిన జూలై నాలుగో తేదిని ఎంచుకున్నారట.

ముహూర్తం కోసం ఆయన జగన్‌ను కలిసి నిర్ణయించారట. వంగవీటి రాధాకృష్ణ బెజవాడలో ముఖ్య నేత. తొలుత కాంగ్రెసు పార్టీలో ఉన్న వంగవీటి రాధా ఆ తర్వాత చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవి తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించి కొంతకాలం ఆయన రాజకీయాలతో అంటీముట్టనట్లు ఉన్నారు.

ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగినప్పటికీ చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. విజయవాడలో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వంగవీటి రాధాకు చిరంజీవితో వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆయన పిఆర్పీ విలీనం అయినప్పటికీ కాంగ్రెసులోకి వెళ్లలేదు. తాజాగా జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

English summary
Vijayawada top political leader Vangaveeti Radhakrishna may join in YS Jagan's YSR Congress party on 4th of July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X