వైయస్సార్ కాంగ్రెస్ అంటే చెప్పలేని జగన్: రఘువీరా

నీతి, నిజాయితీ అనే జగన్ తనపై వచ్చిన ఆరోపణలపై స్టే కోసం కోర్టుకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెసు పార్టీ ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని చెప్పారు.
వైయస్సార్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని జగన్ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించుకున్నారని రఘువీరా రెడ్డి చెప్పారు. వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీదే విజయమన్నారు. అనంతపురం, రాయదుర్గంలో పార్టీ గెలుపొందటం ఖాయమన్నారు. గిరిజనులను మన్యం నుంచి వెళ్లగొట్టే రాజ్యాన్ని జగన్ తెస్తానంటున్నాడని మరో మంత్రి శైలజానాథ్ విమర్శించారు.
లక్ష చదరపు అడుగుల ఇల్లు కట్టుకున్న వైయస్ జగన్ విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెసు పైన విమర్శలు చేయడం అనైతికమన్నారు. రాష్ట్రంలో భారీగా డబ్బు మూటలు ఉన్న వ్యక్తి జగన్ అన్నారు. నిజాయితీ, విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమపై ఉన్న కేసులపై విచారణకు సహకరించకుండా కోర్టులకు ఎందుకు వెళ్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications