తెలంగాణ ఆత్మహత్యలు: రాహుల్ గాంధీ పైనా పిటిషన్

కాగా తెలంగాణ ఆత్మహత్యలకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయే కారణమని తెలంగాణ ప్రాంతానికి చెందిన లాయర్ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ పైన పాటియాల కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సుమారు 40 నిమిషాల పాటు పాటియాల హౌస్ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ మేరకు మృతుల కుటుంబాల నుంచి కోర్టు వాంగ్మూలాన్ని తీసుకొని నమోదు చేసింది.
సోనియాకు నోటీసులిచ్చి కేసు నమోదు చేయాలని పిటిషనర్ అరుణ్ కోర్టును కోరారు. అందుకు యుపిఏ చైర్మ పర్సన్ అయినంత మాత్రాన సోనియాకు నోటీసులు ఇవ్వాలా అని జడ్జి అరుణ్ను ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు తమ వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే మోసం ఎలా అవుతుందని, తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయలేదని, ఆ అంశం ఆమె చేతుల్లో లేదు కదా అని కోర్టు అరుణ్కు తెలిపింది.
తెలంగాణపై నిర్ణయం తీసుకోక పోవడం వల్ల అన్ని ప్రాంతాల వారు ఇబ్బందులు పడుతున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే తెలంగాణ అంశం ఆమె చేతుల్లో లేదు కదా అని కోర్టు ప్రశ్నించింది. కాగా సోనియా వైఖరి కారణం వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని లాయర్ అరుణ్ కుమార్ ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications