విజయ సాయి రెడ్డి కోసమే జగన్ పర్యటన వాయిదా?

అయితే జగన్ మాత్రం రెండు రోజులు తన ఉప ఎన్నికల పర్యటన వాయిదా వేసుకుంటూ వచ్చారు. తన ఆస్తుల కేసులో ఎ-2గా ఉన్న విజయ సాయి రెడ్డి బెయిల్ పైన బయటకు వస్తున్నారన్న నేపథ్యంలోనే జగన్ ఆయన కోసం పర్యటన వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. తాను ప్రచారానికి వెళితే నెల రోజుల వరకు పర్యటన కొనసాగనుందని, కాబట్టి ఆయన బయటకు వస్తే ఇప్పుడే మాట్లాడటం మంచిదని జగన్ భావించారని అంటున్నారు.
నరసన్నపేటలో 13న ప్రచారం ప్రారంభించాల్సి ఉండె. అయితే బెయిల్ వస్తుందోమేనని తెలిసిన జగన్ పర్యటన వాయిదా వేసుకుంటూ వచ్చారు. శుక్రవారం సాయంత్రం విజయ సాయి రెడ్డిని విడుదల చేశారు. దీంతో ప్రచారాన్ని మొదట శనివారానికి వాయిదా వేసుకున్న జగన్ ఆ తర్వాత ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. జగన్ శనివారం ఉదయం విజయ సాయి రెడ్డిని కలిసి సుదీర్ఘ మంతనాలు జరిపిన విషయం తెలిసిందే.
కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి సిబిఐ ఎలా వ్యవహరించింది, జగన్ అరెస్టు అవకాశాలు ఎలా ఉన్నాయన్న పలు అంశాలపై చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. లోటస్ పాండుకు వచ్చిన విజయ సాయి మీడియాతో మాట్లాడారు. తాను వైయస్ జగన్ విషయం మాట్లాడబోనని చెప్పారు. వైయస్ జగన్ ఆస్తుల కేసు గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. జైలు జీవితం దుర్భరమైందని ఆయన అన్నారు. సిబిఐ తన పని తాను చేసుకు పోతోందని ఆయన అన్నారు. సిబిఐ తన బాధ్యత నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. బెయిల్ ఇచ్చినందుకు ఆయన న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications