వైయస్సార్ టార్గెట్: గవర్నర్కు కిశోర్ చంద్రదేవ్ లేఖ

ఆ టీవీ చానెల్ వార్తాకథనం ప్రకారం - గవర్నర్కు కిశోర్ చంద్రదేవ్ రాసిన 15 పేజీల లేఖ తమ వద్ద ఉందని ఆయన చానెల్ తెలిపింది. జిందాల్, రస్ ఆల్ఖైమాలకు అక్రమంగా బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలకు వైయస్ రాజశేఖర రెడ్డి అక్రమంగా అనుమతులు ఇచ్చారని కిశోర్ చంద్రదేవ్ తన లేఖలో ఆరోపించారు. దాంతోనే ఆ ప్రాంతంలో అలజడి చెలరేగిందని, ఇది శాంతిభద్రతల సమస్యను సృష్టించే ప్రమాదం ఉందని ఆయన గవర్నర్కు రాసిన లేఖలో చెప్పారు.
రాజ్యాంగబద్దంగా సంక్రమించిన విచక్షణాధికారాలను ఉపయోగించి, అనుమతులను రద్దు చేయాలని ఆయన గవర్నర్ను కోరారు. కిశోర్ చంద్రదేవ్ రాసిన లేఖ విషయాన్ని గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు తెలిపినట్లు సమాచారం. దానిపై తనను ఏం చేయమంటారని గవర్నర్ రాష్ట్రపతిని అడిగారు. గవర్నర్ రాష్ట్రపతిని కలిసి ఆ విషయాన్ని వివరించినట్లు ఆ చానెల్ తెలియజేసింది.
కిశోర్ చంద్రదేవ్ గవర్నర్ నరసింహన్కు రాసిన లేఖపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు కూడా పాల్గొన్నారు. మరణించిన తర్వాత వైయస్పై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని, జీవించి ఉన్నప్పుడు ఎందుకు బయటకు తేలేదని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి బాక్సైట్ నిక్షేపాల కేటాయింపు రాజ్యాంగ విరుద్దమని కిశోర్ చంద్రదేవ్ గవర్నర్కు రాసిన లేఖలో ఆరోపించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications