వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్సార్ టార్గెట్: గవర్నర్‌కు కిశోర్ చంద్రదేవ్ లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై మరో పిడుగు పడింది. వైయస్ రాజశేఖర రెడ్డిని నిర్ణయాన్ని తప్పు పడుతూ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాసినట్లు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఉత్తరాంధ్రలోని బాక్సైట్ నిక్షేపాలను కొన్ని సంస్థలకు కట్టబెడుతూ వైయస్ రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, నిబంధనలు ఉల్లంఘించి బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని ఆరోపిస్తూ ఆయన గవర్నర్‌కు లేఖ రాసినట్లు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ఆ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిక్షేపాలను వైయస్సార్ రాజ్యాంగ విరుద్ధంగా కొన్ని సంస్థలకు కేటాయించారనేది కిశోర్ చంద్రదేవ్ ప్రధాన ఆరోపణగా టీవీ చానెల్ వార్తాకథనాన్ని బట్టి తెలుస్తోంది.

ఆ టీవీ చానెల్ వార్తాకథనం ప్రకారం - గవర్నర్‌కు కిశోర్ చంద్రదేవ్ రాసిన 15 పేజీల లేఖ తమ వద్ద ఉందని ఆయన చానెల్ తెలిపింది. జిందాల్, రస్ ఆల్‌ఖైమాలకు అక్రమంగా బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలకు వైయస్ రాజశేఖర రెడ్డి అక్రమంగా అనుమతులు ఇచ్చారని కిశోర్ చంద్రదేవ్ తన లేఖలో ఆరోపించారు. దాంతోనే ఆ ప్రాంతంలో అలజడి చెలరేగిందని, ఇది శాంతిభద్రతల సమస్యను సృష్టించే ప్రమాదం ఉందని ఆయన గవర్నర్‌కు రాసిన లేఖలో చెప్పారు.

రాజ్యాంగబద్దంగా సంక్రమించిన విచక్షణాధికారాలను ఉపయోగించి, అనుమతులను రద్దు చేయాలని ఆయన గవర్నర్‌ను కోరారు. కిశోర్ చంద్రదేవ్ రాసిన లేఖ విషయాన్ని గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు తెలిపినట్లు సమాచారం. దానిపై తనను ఏం చేయమంటారని గవర్నర్ రాష్ట్రపతిని అడిగారు. గవర్నర్ రాష్ట్రపతిని కలిసి ఆ విషయాన్ని వివరించినట్లు ఆ చానెల్ తెలియజేసింది.

కిశోర్ చంద్రదేవ్ గవర్నర్ నరసింహన్‌కు రాసిన లేఖపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్

కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు కూడా పాల్గొన్నారు. మరణించిన తర్వాత వైయస్‌పై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని, జీవించి ఉన్నప్పుడు ఎందుకు బయటకు తేలేదని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి బాక్సైట్ నిక్షేపాల కేటాయింపు రాజ్యాంగ విరుద్దమని కిశోర్ చంద్రదేవ్ గవర్నర్‌కు రాసిన లేఖలో ఆరోపించారు.

English summary
According to ABN - andhrajyothy TV Channel - the union minister Kishore Chandra Deo has written a letter to governor Narasimhan opposing YS Rajasekhar Reddy's decission allocating bauxite mines to few companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X