చిరంజీవి నట్టేట ముంచాడు: రోజా, సారయ్యపై గోనె ఫైర్

తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆమె చెప్పారు. ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రోజా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిరంజీవిపై మండిపడ్డారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రులు బస్వరాజు సారయ్య, కొండ్రు మురళీ మోహన్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు శుక్రవారం ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం సభ పెడతానని సారయ్య చెబితే వైయస్ బెదిరించారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
సారయ్య, కొండ్రు తమ స్వార్థం కోసమే వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ ఆడిస్తున్న నాటకంలో ఓ భాగమే సారయ్య వ్యాఖ్యలు అన్నారు.
1989లో పార్టీ అభ్యర్థి ఓటమికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిగిన చరిత్ర బస్వరాజు సారయ్యది అని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు వైయస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. మంత్రులు జానా రెడ్డి, చిన్నారెడ్డి, బస్వరాజు సారయ్యలు పదవుల కోసం తెలంగాణను తాకట్టు పెడ్డారని దుయ్యబట్టారు. కాగా తాను తెలంగాణ కోసం సభను పెడతానంటే వైయస్ రాజశేఖర రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వనని ఫోన్లో బెదిరించారని బస్వరాజు సారయ్య గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications