మూడు రోడ్డు ప్రమాదాలు: 9 మంది దుర్మరణం

మరణించినవారు మెదక్ జిల్లా దుబ్బాక గ్రామానికి చెందినవారు. వీరంతా శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.
కడప జిల్లాలోనే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం దిలసంచ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం చిన్నయ్యపాలెం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న ఓ వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications