గాలి, శ్రీలక్ష్మి పిటిషన్లను తోసిపుచ్చిన సిబిఐ కోర్టు

Janardhan Reddy - Srilaxmi
హైదరాబాద్: తమ బెయిల్ పిటిషన్లపై విచారణను గతంలో విచారించిన న్యాయమూర్తి నాగమారుతీ శర్మకే బదలాయించాలని కోరుతూ అక్రమ మైనింగ్ కేసులో నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న పిటిషన్లను సిబిఐ ప్రత్యేక కోర్టు శనివారం తోసిపుచ్చింది. వారి వాదనలు వింటూ వస్తున్న న్యాయమూర్తి నాగమారుతీ శర్మ అక్కడి నుంచి బదిలీ అయి న్యాయమూర్తి పుల్లయ్య వచ్చారు. దీంతో తమ పిటిషన్ల విచారణను నాగమారుతీ శర్మ కోర్టుకు బదలాయించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి, శ్రీలక్ష్మి పిటిషన్లు దాఖలు చేసుకున్నారు.

కాగా, గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే నెల 2వ తేదీన వాదనలు వింటామని కోర్టు తెలిపింది. గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజెత్మలానీ హాజరయ్యారు. అయితే, అడిషినల్ సొలిసిటర్ జనరల్ రానందున వాదనలకు సమయం కావాలని సిబిఐ కోరింది.

సిబిఐ అభ్యర్థనను మన్నించిన కోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. వాదనలను వాయిదా వేయవద్దని గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు. సిబిఐ వ్యాఖ్యలు సరైనవి కావని, వాయిదా కోరడం సరి కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతివాదులు సీనియర్ న్యాయవాదులను దిగువ కోర్టులో వాదనలు వినిపించేందుకు ఎత్తుగడ అంటూ సిబిఐ తరఫు న్యాయవాది అన్నారు.

సిబిఐ తరఫు న్యాయవాది వ్యాఖ్యలను ప్రతివాదుల న్యాయవాదులు తప్పు పట్టారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి నిందితులు ఎవరైనా తమ తరఫున వాదనల కోసం నియమించుకునే హక్కు అందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+