నన్ను హేళన చేశారు, ఎందర్ని గెలిపిస్తారో చూస్తా: డిఎల్

ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని ఆయన చెప్పారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం జరుగుతోందన్నారు. ఆయన నిర్ణయం ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నప్పుడు గెలుపోటముల బాధ్యత కూడా పూర్తిగా ఆయనదే అని చెప్పారు.
తాను కడప జిల్లాలో జరుగుతున్న మూడు నియోజవర్గాల బాధ్యతను ఏమాత్రం తీసుకోనని చెప్పారు. కడప ఉప ఎన్నికలలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయినప్పుడు, తనకు డిపాజిట్ కూడా దక్కలేదని కొందరు మంత్రులు, నేతలు తనను అవహేళన చేశారని అన్నారు.
తనను అవహేళన చేసిన వారు ఇప్పుడు పలు నియోజకవర్గాలకు ఇంచార్జులుగా ఉన్నారని వారు ఎంత మందిని గెలిపిస్తారో చూస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇంచార్జులుగా ఉన్న మంత్రుల సత్తా ఉప ఎన్నికలతో తేలుతుందని ఆయన చెప్పారు. తాను డిపాజిట్ పోగొట్టుకున్న వ్యక్తినని, అలాంటప్పుడు ఉప ఎన్నికలలో తాను చేసేదేముంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications