కేంద్రం ఇస్తే తెలంగాణ ఓకే: సీమాంధ్ర టిడిపి, జగన్పై ఫైర్

వైయస్ జగన్ను గెలిపిస్తే తిరుమలలో వెంకన్న విగ్రహం దొంగిలించి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతారన్నారు. ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడిన సమయంలో జగన్ తాత రాజారెడ్డి బ్రిటిష్ మిలటరీలో చేరారని ఆరోపించారు. శ్రీవారిని నల్లరాయితో పోల్చి చెప్పులు విసరాలన్న భూమన కరుణాకర్ రెడ్డికి వైయస్ టిటిడి చైర్మన్ పదవి కట్టబెట్టారన్నారు. కడప జిల్లాకు వైయస్ పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఆయన ఏమైనా అన్నమాచార్యుడా అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కుర్చీ ఎక్కడ ఊడిపోతుందో అనే భయంతోనే అవినీతిని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఎర్రన్నాయుడు విమర్శించారు. మద్యం తదితర కేసులలో అసలు దోషులను వదిలేసి అధికారులను బలి చేస్తున్నారన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుదేశం పార్టీ అందుకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. వైయస్ జగన్ అవినీతిని ఊరూరా ప్రచారం చేస్తామని చెప్పారు.
కాగా మహానాడులో ఉప ఎన్నికల అంశం, రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించినట్లు ఎర్రన్నాయుడు చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల నేపథ్యంలో మహానాడును వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల తర్వాత మహానాడు తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ అంశంపై భేటీలో చర్చించలేదన్నారు.
మరోవైపు ఉప ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఉప ఎన్నికల తర్వాత తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇప్పిస్తామని ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా వరంగల్ జిల్లాలో అన్నారు. చిదంబరంను బాబు కలిశారని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. టిఆర్ఎస్, చిదంబరమే కుమ్మక్కయ్యారన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ కలిసి టిడిపిని భూస్థాపితం చేయాలని కుట్ర పన్నుతున్నాయన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications