కెవిపిపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెసు తెలంగాణ ఎంపిలు

గత మూడేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ వాదాన్ని గెలిపించారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల మనసుల్ని గాయపర్చేలా, వారిని రెచ్చగొట్టేలా ఈ ప్రకటనలు ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ సాధనే తమ లక్ష్యం తప్ప ప్రభుత్వాన్ని పడగొట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. వైయస్ హయాంలో అన్ని సలహాలూ కేవీపీవేనని, అలాంటప్పుడు అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా వైఎస్ చేసిన ప్రకటన సంగతి ఏమిటని మంద జగన్నాథం ప్రశ్నించారు.
1953లో తెలంగాణ ఎంపీలు కూడా విలీనానికి ఒప్పుకున్నారన్న కేవీపీ ప్రకటనపై వివేక్ స్పందించారు. ప్రజల ఒత్తిడితో ఆ ఎంపీలంతా తమ ప్రకటనను వెనక్కి తీసుకున్నారని, తర్వాత పార్లమెంటులో కూడా తెలంగాణపై వారు మాట్లాడారని వివరించారు. కేవీపీ సలహాదారుగా ఉన్నప్పుడు తెలంగాణకు నిధులు తక్కువగా కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలలో సీమాంధ్రలోని అన్ని స్థానాల్లో పార్టీని గెలిపిస్తే బాగుంటుందని, తెలంగాణ విషయం తమకు వదిలేయాలని సూచించారు.
రాజ్యసభలో చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్సహా అన్ని పార్టీలూ తెలంగాణ ఇవ్వాలని కోరుతున్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమస్యకు పరిష్కారం కోరకుండా, సమ స్య అనైతికమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని కేవీపీ మాట్లాడటం తగదన్నారు. రాజ్యసభలోని తెలంగాణ ఎంపీలు ఈ అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారనీ, త్వరలో తాము కూడా తీసుకెళతామని చెప్పారు.












Click it and Unblock the Notifications