హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంకర్ దాదా దెబ్బకు తెరుచుకున్న తలుపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు దెబ్బకు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) దిగి వచ్చింది. సిఎల్పీలో మీడియా ప్రతినిధుల సమావేశం పెట్టే గది తలుపులు తెరుచుకున్నాయి. ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఆరోపణపై శంకరరావును మీడియా సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు గదికి రెండు రోజుల పాటు తాళాలు వేశారు. దీంతో శంకరరావు సిఎల్పీ కార్యాలయం మెట్ల మీదనే మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు.

తన హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ స్పీకర్‌కు శంకరరావు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. శంకరరావు వాదనను తిప్పికొట్టడానికి శానససభ్యుడు కె. లక్ష్మారెడ్డి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రయత్నాలు చేశారు. అయితే, పరిస్థితి చేయి దాటిపోతుందనే ఉద్దేశంతో శనివారం మీడియా గది తాళాలు తీసినట్లు తెలుస్తోంది. దీంతో మీడియా గదిలో శంకరరావు శనివారం మీడియాతో మాట్లాడారు.

తానెప్పుడూ వాస్తవాలే మాట్లాడుతానని శంకరరావు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కాంగ్రెసు పార్టీకి, ప్రభుత్వానికి తాను వాచ్ డాగ్‌నని ఆయన చెప్పుకున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే తాను సహించబోనని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు మాట్లాడినా తాను ఊరుకోనని ఆయన అన్నారు.

అంబేడ్కర్‌పై వచ్చిన కార్టూన్‌ను ఆయన వ్యతిరేకించారు. అంబేడ్కర్‌కు తానే భారతరత్న ఇచ్చానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పుకోవడాన్ని ఆయన ఆక్షేపించారు. అంబేడ్కర్‌కు ఎవరి కితాబు అవసరం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టేవారిని ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన చెప్పారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎవరితోనూ మ్యాచు ఫిక్సింగ్ చేసుకోలేదని, అవినీతికి పాల్పడితే సొంత కుమారుడినైనా వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు.

English summary
CLP office media room was opended as former minister and Congress MLA made an issue of its closure. He addressed media on saturday from media room. He said that he is commited to his criticism made against CM Kiran kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X