జగన్పై మండిపడ్డ చిరంజీవి, 28న ఏమైనా జరగొచ్చు

నిమ్మగడ్డ ప్రసాద్, సత్యం రామలింగరాజులను కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం బలి చేశారన్నారు. పారిశ్రామికవేత్తలకు ఆశలు చూపించి ప్రలోభ పెట్టి జైళ్లకు వెళ్లేందుకు కారకులయ్యారన్నారు. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు రాకపోవడానికి కారకులయ్యారన్నారు. పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే స్థితికి తీసుకు వచ్చారన్నారు.
అవినీతి, అక్రమాల బురదలో కూరుకుపోయిన వారు తమకూ ఆ బురద అంటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల గందరగోళానికి కొందరి అధికార దాహమే కారణమన్నారు.
చెన్నైలోని తన బంధువు ఇంట్లో దొరికిన డబ్బుపై సాక్షి పత్రిక రాసిన కథనాలపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని అన్నారు. వారితో చర్చించిన అనంతరం కోర్టుకు వెళ్తామని చెప్పారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాలలో ప్రచారం చేసేందుకు తాను వెళుతున్నానని, అందుకే తిరుపతి మీదుగా వచ్చానని చెప్పారు.
ఈ నెల 28 తర్వాత ఏమైనా జరగవచ్చునని చిరంజీవి అన్నారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ తన విధానాన్ని పాటిస్తోందన్నారు. చెన్నైలోని తన బంధువు ఇంట్లో దొరికిన సొమ్ముతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాగా ఈ నెల 28న కోర్టుకు హాజరు కావాలని జగన్కు సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే.
-
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్ -
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన!












Click it and Unblock the Notifications