జగన్ సహా అందరినీ ప్రశ్నిస్తాం!: ఈడి, జైలుకు మోపిదేవి

ఈడి పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అంతకుముందు దిల్ కుషా అతిథి గృహంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అతనిని కోర్టుకు తరలించారు. కోర్టు మోపిదేవికి 7వ తేది వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని చంచల్గూడ జైలుకు తరలించారు.
తనకు బెయిల్ ఇవ్వాలని మోపిదేవి వెంకటరమణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పైన విచారణను గురువారానికి వాయిదా వేశారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలంటూ మరో పిటిషన్ మోపిదేవి దాఖలు చేశారు. అందుకు కోర్టు అంగీకరించింది. మోపిదేవిని జైలులో ప్రత్యేక ఖైదీగా గుర్తించనున్నారు.
కాగా మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు ఈ నెల 24న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేటితో మోపిదేవి సిబిఐ కస్టడీ ముగిసింది. ఇటీవల స్వల్పంగా అనారోగ్యానికి గురి కావడంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఇప్పుడు అతనిని కోర్టులో హాజరుపర్చారు. మళ్లీ మోపిదేవి కస్టడీకి సిబిఐ పిటిషన్ దాఖలు చేయలేదు. జైలులో మోపిదేవికి అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 6113 కేటాయించారు.
తాను నిబంధనల మేరకే అనుమతులు ఇచ్చానని మోపిదేవి తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించానని తెలిపారు. వాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఫైళ్లను సిబిఐ సీజ్ చేసిందని తెలిపారు. తొమ్మిది నెలలుగా సిబిఐ విచారణకు సహకరిస్తున్నట్లు చెప్పారు. తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, బెయిల్ ఇప్పించాలని కోరారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications