తెలంగాణపై వైయస్ నన్ను బెదిరించారు: యాష్కీ

తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు తనను పిలిపించి రాజకీయ జీవితం నాశనం చేస్తానని వైయస్ రాజశేఖర రెడ్డి బెదిరించారని ఆయన ఆరోపించారు. మంత్రులకు, నాయకులకు తాయిలాలు ఇచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్ ఎప్పుడూ సచివాలయానికి గానీ ప్రభుత్వ కార్యాలయాలకు గానీ రాని మాట వాస్తవమేనని, వైయస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్, విజయమ్మ కలిసి ఫోన్లోనే రాయబారాలు సాగించారని ఆయన అన్నారు.
తెలంగాణకు వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బద్ధశత్రువులని ఆయన అన్నారు. జగన్ సెటిల్మెంట్లన్నీ విజయమ్మకు తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆయన సూచించారు. వైయస్ జగన్పై మధుయాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలుంటే వైయస్ జగన్ పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించలేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి శనివారం వరంగల్లు జిల్లాలో అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెసుపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications