విద్యార్థులపై నుండి దూసుకెళ్లిన బస్సు, ఒకరి మృతి

నారాయణ కళాశాలలో ఇంటర్మీడియేట్ చదువుతున్న అతుల్ లోయ, గోవింద్ జాజులు హోండా యాక్టివాపై కళాశాలకు వెళుతున్నారు. వారు కోఠి నుండి నారాయణగూడ వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో వారి ముందు ఉన్న వాహనంలోని ఓ పోలీసు అనుకోకుండా వాహనం డోర్ తెరిచారని సమాచారం. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా బ్రేక్ వేశారు. వారికి పోలీసు వాహనం తాకి కిందపడ్డారు.
దీంతో అటు వైపు నుండి వెళ్తున్న ఓ ఆర్టీసి బస్సు వీరిపై నుండి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతుల్ అక్కడికక్కడే మృతి చెందగా, గోవింద్కు తీవ్రంగా గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు, స్థానికులు గోవింద్ను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థులు అందరూ నారాయణగూడ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు.
వాహనం డోరు హఠాత్తుగా తెరిచిన పోలీసును వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని విద్యార్థులు ఆందోళన చేశారు. పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే విద్యార్థుల మాత్రం పోలీసును అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. మృతుడు మలక్పేట వాసి.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications