ఇన్ని రోజులకొస్తారా?: లక్ష్మీపేటలో బాబుకు ఝలక్

బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటన జరిగిన పదిరోజులైనా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే రాష్ట్రం ఎక్కడకు పోతుందనే ఆందోళన కలుగుతోందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరెవరైనా ఇలాంటి తప్పు చేయాలంటే భయపడేలా శిక్షించాలన్నారు. దళితులపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సిఐడితో కాకుండా సిబిఐతో ఈ కేసును విచారింపచేయాలన్నారు. గాయపడిన వారిని ఆదుకోవాలన్నారు. లక్ష్మీపేట ఘటనలో గాయపడి విశాఖ కెజిహెచ్లో చికిత్స పొందుతూ మరణించిన పాపయ్య కుటుంబాన్ని బాబు పరామర్శించారు. దాడి ఘటనపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పారు.
కాగా లక్ష్మీపేటలో చంద్రబాబు పరామర్శిస్తుండగా ఆయనకు చిన్న షాక్ తగిలింది. సంఘటన జరిగిన పదిరోజుల తర్వాత బాబు పరామర్శకు రావడాన్ని దళిత సంఘాలు, మహిళలు కొందరు తప్పు పట్టారు. ఘటన జరిగిన ఇన్ని రోజులకు పరామర్శకు రావడమేమిటని ప్రశ్నించారు.
అంతకుముందు విశాఖపట్నంలో మాట్లాడిన చంద్రబాబు... కోలా కృష్ణమోహన్ చెప్పిన మాటల్లో నిజం లేదని చెప్పారు. సిబిఐ జెడితో విలేకర్లు మాట్లాడటం వారి వృత్తిధర్మంలో భాగమన్నారు. విలేకరులు జెడితో మాట్లాడటాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంపై ఇంకా తాము నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications