పాతబస్తీలో కలకలం రేపిన పేలుడు, రంగారెడ్డిలో హత్య

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఓ పేలుడు స్థానికంగా కాసేపు కలకలం సృష్టించింది. యాకుత్‌పురాలోని ఓ ఇంట్లో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడు ధాటికి ఇంటి తలుపులు, కిటీకీలు ఊడిపడ్డాయి. ఫర్నిచర్ ధ్వంసమైంది. ఈ భారీ శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పాతబస్తీలోనే ఓ దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం నవవధువు సబియాను భర్త, మామ కత్తులతో పొడిచారు. ఈ ఘటనలో సబియా తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఛత్రినాక పోలీసులు అక్కడకు చేరుకుని భర్త ఫయాజ్, మామను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఓ ప్రార్థనా మందిరం ఆధిపత్య పోరు ఓ యువకుడి ప్రాణాలు తీసింది. స్థానిక ప్రార్థనా మందిరం విషయంలో మంగళవారం ఉదయం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అతనిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+