జెడి కాల్లిస్ట్: సంబంధం లేదన్న సాక్షి విలేకరి, పిటిషన్

దీంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ విలేకరి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఫోన్ కాల్స్ లీకేజి వ్యవహారంతో పాటు, ఈ ఘటనపై సాక్షిలో ప్రసారమైన కథనంతో కూడా తనకు సంబంధం లేదని, కుట్ర పూరితంగానే తనపై కేసు మోపారని, ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన నేరారోపణలన్నీ అవాస్తవాలని తన పిటిషన్లో పాత్రికేయుడు పేర్కొన్నారు.
తాను చట్టాన్ని గౌరవించే పౌరుడిని అని, నల్గొండ జిల్లా నార్కట్పల్లి నివాసిని అని వివరిస్తూ... అజ్ఞాతంలోకి వెళ్లే ప్రశ్నే ఉత్పన్నం కాదని విన్నవించాడు. బెయిల్ మంజూరు చేస్తే దర్యాఫ్తు అధికారికి పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నాడు. కాగా ముందస్తు బెయిల్ నోటీసు అదనపు పిపి నాగరాజుకు ఇచ్చారు. సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కేసు తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేశారు.
కాగా సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ కాల్ లిస్ట్ ఇటీవల సంచలనం రేపిన విషయం తెలిసిందే. సిబిఐ జెడితో చంద్రబాల, ఇతర మీడియా ప్రతినిధులు మాట్లాడిన కాల్ లిస్టును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు విడుదల చేశారు. చంద్రబాలతో ఆంధ్రజ్యోతి ఎండి మాట్లాడారని వారు ఆరోపించారు. కాల్ లిస్టు పైన వారు అనుమానాలు వ్యక్తం చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications