రాయల తెలంగాణ: శ్రీకాంత్రెడ్డితో గొంతు కలిపిన బైరెడ్డి

రాయలసీమను ముక్కలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. తమ ప్రాణాలనైనా అర్పించి రాయలసీమ ఉనికిని కాపాడుకుంటామని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా రాయలసీమ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాయలసీమ విభజనను తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. రాయలసీమ విషయంలో వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉందని ఆయన అన్నారు.
కర్నూలు జిల్లాను తమకు వద్దని కొందరు అంటున్నారని, తాము ఇస్తామని అంటున్నామా అని ఆయన అన్నారు. రాయలసీమ కోసం తాము ఎన్నో త్యాగాలు చేశామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైనప్పుడు ఏం చేయాలో తాము ఆలోచించుకుంటామని ఆయన అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్న నాయకులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి బుధవారంనాడు తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.
రాయల తెలంగాణ ప్రతిపాదనకు కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వంటి రాయలసీమ నాయకులు కొందరు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సమైక్యాంధ్రకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న మజ్లీస్ పార్టీ రాయల తెలంగాణకు అంగీకరిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాయల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావచ్చుననే మాట వినిపిస్తోంది. దీంతో రాయలసీమ జిల్లాలకు చెందిన నాయకులు గొంతు పెంచారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications