రాయల తెలంగాణ: శ్రీకాంత్‌రెడ్డితో గొంతు కలిపిన బైరెడ్డి

Baireddy Rajasekhar Reddy
కర్నూలు: రాయల తెలంగాణ ప్రతిపాదనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డితో తెలుగుదేశం రాయలసీమ ప్రాంత నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గొంతు కలిపారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాయలసీమను ఇవ్వడానికి టేబుల్ మీద ఉన్న గిఫ్ట్ ఐటమా అని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు.

రాయలసీమను ముక్కలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. తమ ప్రాణాలనైనా అర్పించి రాయలసీమ ఉనికిని కాపాడుకుంటామని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా రాయలసీమ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాయలసీమ విభజనను తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. రాయలసీమ విషయంలో వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉందని ఆయన అన్నారు.

కర్నూలు జిల్లాను తమకు వద్దని కొందరు అంటున్నారని, తాము ఇస్తామని అంటున్నామా అని ఆయన అన్నారు. రాయలసీమ కోసం తాము ఎన్నో త్యాగాలు చేశామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైనప్పుడు ఏం చేయాలో తాము ఆలోచించుకుంటామని ఆయన అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్న నాయకులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి బుధవారంనాడు తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.

రాయల తెలంగాణ ప్రతిపాదనకు కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వంటి రాయలసీమ నాయకులు కొందరు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సమైక్యాంధ్రకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న మజ్లీస్ పార్టీ రాయల తెలంగాణకు అంగీకరిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాయల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావచ్చుననే మాట వినిపిస్తోంది. దీంతో రాయలసీమ జిల్లాలకు చెందిన నాయకులు గొంతు పెంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+