వారితో సంబంధంలేదు: బొత్స, వైయస్పై విహెచ్ సూచన

వివాదాస్పద జివోల వ్యవహారంలో సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందుకున్న నలుగురు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు, గీతారెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణలకు న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పొన్నాలకు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మోపిదేవికి సహాయం లేకపోవడంపై బొత్స స్పందించి, సిఎంకు లేఖ రాస్తానని ఈరోజు చెప్పారు. సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నానిలతో తమకు సంబంధం లేదని బొత్స అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో వారు ఎవరికి ఓటేస్తారో తమకు అవసరం లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలోపే పిసిసి కార్యవర్గ నియామకాలు ఉండవచ్చునని చెప్పారు.
కాగా గాంధీ భవనంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని కాంగ్రెసు పార్టీ సాదా సీదాగా నిర్వహించింది. పార్టీ కార్యాలయంలో వైయస్ చిత్రపటానికి ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్ బొత్స, మంత్రులు ముఖేష్ గౌడ్, ఎంపి కేవిపి రామచంద్ర రావు, సభాపతి నాదెండ్ల మనోహర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అసెంబ్లీ లాబీలో నిర్వహించిన వేడుకలలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
బొత్స అంతకుముందు పంజాగుట్టలోని వైయస్ విగ్రహానికి పూలమాల వేశారు. నగర పార్టీ కార్యాలయంలో దానం నాగేందర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివంగత వైయస్ పథకాలు అన్ని అమలు అవుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న వైయస్ ఆశయ సాధన కోసం పని చేస్తామన్నారు. వైయస్ మృతిని రాజకీయం చేయడం తగదన్నారు.
మరోవైపు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వైయస్ విషయంలో పార్టీకి సూచనలు చేశారు. వైయస్ను కాంగ్రెసు పార్టీ మరిచి పోవాలని చెప్పారు. ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. 26 జివోలపై అధికారులది తప్పే అన్నారు. వారికి న్యాయ సహాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. మంత్రులకు న్యాయ సహాయం అందించడం సరియైన చర్య అన్నారు. మోపిదేవికి ఎందుకు సహకరించలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications