Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేపాల్లో బస్సు ప్రమాదం, 34మంది ఇండియన్స్ మృతి

ఖాట్మాండ్/శ్రీనగర్: నేపాల్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 34 మంది భారతీయులు, కాశ్మీర్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది అమర్నాథ్ యాత్రీకులు మృతి చెందారు. నేపాల్‌లో యాత్రికులతో కిక్కిరిసిన బస్సు ఒకటి కాలువలో పడి.. 34 మంది భారతీయ భక్తులు సహా మొత్తం 39 మంది మరణించారు. వారిలో ఐదేళ్ల బాలికతోపాటు పదిమంది మహిళలు కూడా ఉన్నారు.

Nepal bus accident kills 36 Indian devotees

ఖాట్మండుకు 250 కిలోమీటర్ల దూరంలోని గండకి కాలువలో బస్సు పడింది. మరణించిన వారిలో ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన వారు, బీహార్‌లోని ధులినిపుల్‌కు చెందిన వారు ఉన్నట్లుగా భారతీయ ఎంబసీ తెలిపింది. వీరంతా నేపాల్‌లోని నవాల్‌పారసి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం నాడు ఈ ప్రమాదం జరిగింది.

మరోవైపు జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 15మంది అమరనాథ్ యాత్రికులు మరణించారు. జమ్మూ - శ్రీనగర్ రహదారిలో శనివారం రాత్రి 11.30 గంటలకు బస్సు ఒకటి లోయలో పడింది. ఈ సంఘటనలో 16 మంది యాత్రికులు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు.

వీరంతా అమరనాథ్ వెళ్లి వస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రా పట్టణం సమీంపంలో ఆదివారంనాడు యాత్రికుల బస్సు ఒకటి లోయలో పడిన ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వీరంతా అమరనాథ్ వెళ్లి వస్తూ ప్రమాదంలో చనిపోయారు. కాగా అమరనాథ్ యాత్రికుల మృతిపై ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రూ. లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.10వేల చొప్పున మంజూరు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+