రూ. 30 వేలకు 11 నెలల కన్నబిడ్డను అమ్మిన తల్లి

Medak Map
మెదక్: తన 11 నెల మగబిడ్డను 30 వేల రూపాయలకు విక్రయించిన ఓ తల్లి ఉదంతం వెలుగు చూసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అయితే, ఇందుకు సంబంధించి పోలీసు కేసు ఏదీ నమోదు కాలేదు. కానీ ఈ సంఘటనపై మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అధికారులపై మండిపడ్డారు.

పేరెన్నిక గన్న మెదక్ చర్చిలో కున్యాల కనకమ్మ, వెంకటయ్య దంపతులకు ఆ మగబిడ్డను విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. స్థానిక మహిళ యశోద చిన్నారి తల్లి యేషమ్మకు, కనకమ్మ దంపతులకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. భర్త వదిలేయడంతో యేషమ్మ సదాశివపల్లిలోని తన తల్లిగారింట్లో ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన రెండో కుమారుడిని అమ్మడానికి ఆమె సిద్ధపడినట్లు చెబుతున్నారు.

యేషమ్మ వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. వ్యవసాయ కూలీలుగానే పనిచేస్తున్న కనకమ్మ, వెంకటయ్యలు ఇంతకు ముందు దత్తత కోసం శిశు విహార కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. పిల్లలు లేని కనకమ్మ దంపతులు యేషమ్మ నుంచి బాలుడిని 30 వేల రూపాయలకు కొన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ యేషమ్మ తిరిగి తన బిడ్డను అడిగితే లక్షా 50 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నారు.

అయితే, తర్వాత యేషమ్మ మరింత డబ్బు కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించిందని అంటున్నారు. దీంతో కనకమ్మ దంపతులు సదాశివపల్లిలోని గ్రామ పెద్దలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. యేషమ్మ అడ్వాన్స్‌గా తీసుకున్న పది వేల రూపాయలు తిరిగి ఇవ్వడానికి కూడా నిరాకరించినట్లు చెబుతున్నారు. సమాచారం పొక్కడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే, ఆ సంఘటనపై నోరు విప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు.

కాగా, విజయశాంతి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి, దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులను వేధించవద్దని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+