హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ అట్టుడికిన ఉస్మానియా: భాష్పవాయు ప్రయోగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: చాలా రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం గురువారం మరోసారి అట్టుడికింది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటేయకూడదని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఒయు) విద్యార్థులు ర్యాలీ తీశారు. శానససభ వరకు ర్యాలీని కొనసాగించాలని వారు తలపెట్టారు. అయితే, వారిని పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద ఆపేశారు.

పోలీసులపైకి విద్యార్థులు రాళ్లు విసిరారు. ప్రణబ్ ముఖర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బారికేడ్లను తొలగించుకుని ముందుకు పోవడానికి విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేశారు. విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, రాష్ట్రపతి ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దూరంగా ఉంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ తెరాస రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకూడదని నిర్ణయించుకుంది. అదే సమయంలో పోలింగు సందర్భంగా గురువారం ఉదయం తెరాస శాసనసభ్యులు శాసనసభ వరకు ర్యాలీ తీశారు.

కాగా, తెలంగాణకు మద్దతు ఇస్తున్న తెలంగాణ నగారా సమితి నాయకుడు, శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు శాసనసభ్యులు హరీశ్వర్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి బిజెపి బలపరిచిన పిఎ సంగ్మాకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెసు తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిరసనగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

English summary
Tension prevailed again in Osmania University, as the students tried to take up a rally from the university to the assembly opposing Pranab Mukherjee candidature in president election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X