వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓట్ల లెక్కింపు ప్రారంభం: ప్రణబ్ ఇంటి వద్ద కోలాహలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee - Sangma
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం నాలుగు గంటలలోగా పూర్తయ్యే అవకాశముంది. అలా అయితే సాయంత్రం నాలుగు గంటల వరకే గెలిచిన అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీ ఎన్నిక లాంఛనమేనని యుపిఏ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రణబ్ గెలుపు ఖాయమని, కానీ తాము కేవలం మెజార్టీ ఎంత అనే దాని కోసమే చూస్తున్నామని యుపిఏ వర్గాలు చెబుతున్నాయి.

గెలిచిన అభ్యర్థి ఈ నెల 25న 4వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రణబ్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఆయన ఇంటి వద్ద ఆదివారం ఉదయం నుండి కోలాహలం కనిపిస్తోంది. భారీగా నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు తరలి వస్తున్నారు. ప్రణబ్ కూడా తన గెలుపు ఖాయమనుకుంటున్నారు. ఆయన మెజార్టీ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సాధారణంగా అందరూ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ప్రణబ్ మాత్రం పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రమాణం చేయాలని భావిస్తున్నారు. ప్రణబ్‌కు దాదాపు డెబ్బై శాతం ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు పిఏ సంగ్మా తన ఓటమి ఖాయమని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఇంటి వద్ద ఎలాంటి హంగామా కనిపించడం లేదు.

English summary
UPA candidate Pranab Mukherjee is virtually set to become the 14th President of India on Sunday when the counting and declaration of results of the July 19 poll takes place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X