వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆజాద్ హిందూ ఫౌజ్' కెప్టెన్ లక్ష్మీసెహగల్ కన్నుమూత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lakshmi Sahgal
న్యూఢిల్లీ: ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు లక్ష్మీ సెహగల్ సోమవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె ఇటీవల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆమె ఇప్పటి వరకు స్పహలోకి రాలేక పోయారని, మందులకు కూడా స్పందించలేక తుది శ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌తో కలిసి పని చేసిన సెహగల్ ఆజాద్ హిందూ ఫౌజ్‌లో కీలక పాత్ర పోషించారు.

ఆమె చేసిన సేవలకు కల్నల్ ర్యాంకు లభించింది. 2002లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి అబ్దుల్‌ కలాంపై వామపపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు 1998లో ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇచ్చింది. 1914 అక్టోబరు 14న మద్రాసులో లక్ష్మీ సెహగల్ జన్మించారు.

1940లో డాక్టర్ లక్ష్మీ సెహగల్ సింగపూర్‌లో సైనికులకు వైద్య సహాయం అందించే వారు. అదే సమయంలో సుభాష్ చంద్రబోసు పిలుపు మేరకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంటులో చేరి సెహగల్ సేవలందించారు. భారత్‌కు తిరిగి వచ్చాక 1971లో సిపిఎంలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1947లో లాహోర్‌కు చెందిన కల్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్‌తో వివాహం అయ్యాక ఆమె కాన్పూర్‌లో స్థిరపడ్డారు.

English summary
Prominent freedom fighter and a member of Netaji Subhash Chandra Bose's INA, Capt Lakshmi Sehgal passed away. She was 97. She was suffering from various health complications since the last few days and breathed her last on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X