పవార్కు తలొగ్గిన కాంగ్రెసు: కథ సుఖాంతం

శరద్ పవార్ తన డిప్యూటీ ప్రఫుల్ పటేల్తో కలిసి బుధవారం సాయంత్రం ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిశారు. సమన్వయలోపం, కాంగ్రెసు ఏకపక్ష నిర్ణయాలతో అసంతృప్తికి గురైన శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వం నుంచి తాము తప్పుకుంటామని హెచ్చరించారు. గత కొద్ది రోజుల వివాదం ముగిసిపోయిందని సోనియా, మన్మోహన్లతో భేటీ తర్వాత ప్రఫుల్ పటేల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఓ సమర్థవంతమైన సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, యుపిఎ మిత్రపక్షాలు నెలకు ఒకసారి సమావేశమై విధాన నిర్ణయాలపై, ఇతర విషయాలపై చర్చించనున్నట్లు సమావేశానంతరం ఓ ప్రకటన వెలువడింది. ఢిల్లీలో ఏర్పాటయ్యే సమన్వయ కమిటీకి సోనియా గాంధీ నేతృత్వం వహిస్తారని ప్రఫుల్ పటేల్ చెప్పారు.
మహారాష్ట్ర సంకీర్ణంలోని కాంగ్రెసు, ఎన్సిపీలతో రాష్ట్ర స్థాయిలో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఇరు పార్టీల ప్రతినిధులు ఉంటారని ఆయన చెప్పారు. 2014 వరకు తమ పార్టీ యుపిఎలో ఉంటుందని ఆయన చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications