వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చగొట్టేందుకే తెలంగాణ ప్రకటన: కెసిఆర్‌పై కావూరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavuri Samabasiva Rao
విజయవాడ: దేశంలో ఎక్కడా మనోభావాల ఆధారంగా రాష్ట్రాల విభజన చేసిన దాఖలాలు లేవని, ఆ దృష్ట్యా రాష్ట్ర విభజన జరిగే ప్రసక్తే లేదని ఏలూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు వెల్లడించారు. బుధవారం ఆయన కృష్ణాజిల్లా కైకలూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొంతమంది స్వార్థం కోసం విద్యార్థులను, పేద ప్రజలను, ఎన్‌జీవో సంఘాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.

మనోభావాల ఆధారంగా రాష్ట్రాలను విభజించదలుచుకుంటే ఉత్తరప్రదేశ్‌ను పది రాష్ట్రాలుగా విభజన చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో కొంతమంది నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన కోరుతున్నారని, విభజన కోరే ప్రాంతాల్లో ఆర్ధికంగాను, సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనుకబడి ఉంటే ప్రభుత్వాలు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం నీరుగారకుండా ఉండేందుకు 10 రోజుల్లో రాష్ట్ర విభజన జరుగుతుందని ప్రకటనలుచేసి ప్రజలను రెచ్చగొట్టి ఉనికిని కాపాడుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన పరోక్షంగా ఆ వ్యాఖ్య చేశారు. ఆగస్టులో లేదా సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తుందని కెసిఆర్ ఇటీవల పదే పదే ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావం దృష్ట్యా ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో డెల్టా సాగుకు వరుణదేవుని కరుణపైనే ఆధారపడి ఉందని కావూరి అన్నారు.

English summary

 Congress Eluru MP Kavuri Samabasiva Rao accused that Telanagana Rastra Samithi (TRS) president K Chanadrasekhar Rao is provocating with Telangana statements. He said that bifurcation of Andhra Pradesh is not possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X