కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ సమాధికి రాఖీ కట్టిన సురేఖ, జగన్‌పై ఆవేదన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధికి రాఖీ కట్టారు. ఈ రోజు రాఖీ పౌర్ణమి. ఈ సందర్భంగా ఆమె గురువారం ఉదయం ఇడుపులపాయకు చేరుకున్నారు. వైయస్సార్ ఘాట్‌ను సందర్శించారు. రక్షా బంధన్‌ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వైయస్ ఉండగా తాము ఆయనకు రాఖీ కట్టే వారమన్నారు.

ఆడపడుచుల కోసం వైయస్ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో ఏ ఆడపడుచూ వైయస్‌ను మర్చిపోరన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రాఖీ పౌర్ణమి రోజు ఆడపడుచులు రాఖీలు కట్ట లేక పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే జగన్ జైలు నుండి బయటకు వస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉండగా ఆయన కేబినెట్‌లోని మహిళా మంత్రులు తదితరులు రక్షా బందన్ రోజు ఆయనకు రాఖీ కట్టే వారు. మంత్రులు గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, సునీత లక్ష్మా రెడ్డి, గల్లా అరుణ కుమారి, కొండా సురేఖ అందరూ ఆయనకు అన్నలా భావించి రాఖీ కట్టే వారు.

English summary
YSR Congress party leader and former minister Konda Surekha tied up Rakhi o late YS Rajasekhar Reddy's tomb at Idupulapaya on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X