Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జైపాల్ రెడ్డిపై నామా నాగేశ్వర రావు, అంబటి ఫైర్

Nama Nageswar Rao-Ambati Rambabu
న్యూఢిల్లీ/ హైదరాబాద్: మహారాష్ట్రకు గ్యాస్ తరలింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. జైపాల్ రెడ్డి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదని, జైపాల్ రెడ్డి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు. గ్యాస్ తరలింపునకు జైపాల్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గ్యాస్ తరలింపునకు పెట్రోలియం శాఖ నుంచి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్యాస్ కోతపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన అన్నారు.

ప్రభుత్వ అసమర్థత వల్లనే రత్నగిరికి గ్యాస్ తరలిపోతోందని ఆయన అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైపాల్ రెడ్డి రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కప్పి పుచ్చడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రత్నగిరి గ్యాస్ కేటాయింపులన్నీ రాష్ట్ర ప్రతినిధులకు తెలిసే జరిగాయని, అందుకు రాష్ట్ర పార్లమెంటు సభ్యులందరూ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. విద్యుత్ కోతతో ప్రజలు అల్లాడుతుంటే కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని ఆయన విమర్శించారు.

మన రాష్ట్రానికి చెందిన గ్యాస్‌ను మహారాష్ట్రకు తరలిస్తుంటే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఏం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఆపలేకపోయిన జైపాల్ రెడ్డి తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన మంగళవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు.

మంత్రుల సాధికారిక కమిటీలో సభ్యులుగా ఉన్న కేంద్ర మంత్రులు మురళీదేవరా, షిండేలు గ్యాస్‌ను అక్రమంగా తరలించుకుపోతుంటే అదే కమిటీలో సభ్యుడిగా ఉన్న జైపాల్ రెడ్డి కళ్లు ఎందుకు మూసుకున్నారని ఆయన అడిగారు. జైపాల్ రెడ్డి తెలుగు ప్రజలకే కాకుండా దేశప్రజలకు కూడా సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తక్షణమే రత్నగిరి కేటాయింపులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జైపాల్ రెడ్డి సహా మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న నలుగురు కూడా రాజీనామా చేయాలని ఆయన అన్నారు. గ్యాస్ తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని అంబటి రాంబాబు అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే తమ పార్టీ మహోద్యమం చేస్తుందని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+